విద్యార్థినులను బూతులు తిడుతున్న కండక్టర్.. డిపో ముందు స్టూడెండ్ల నిరసన..

Update: 2024-08-14 16:23 GMT

దిశ, షాద్ నగర్ః చదువుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న విద్యార్థినిల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్న తీరు షాద్ నగర్ లో సంచలనం రేపుతోంది. ప్రతిరోజు షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థి, విద్యార్థినిలు చదువు కోసం షాద్ నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్ధినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్ డేట్ లేకపోయినా, బ్యాగ్ లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమయినా బండబూతులు తీట్టి మధ్యలోనే బస్ ను ఆపి దింపి వేస్తాడని వాపోయారు. బుదవారం సంగెం గ్రామానికి వచ్చిన బస్ లోనే విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లి తండ్రులు షాద్ నగర్ బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యార్ధినుల పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఇబ్బందులకు గురిచేసిన బస్ కండక్టర్ పై చర్య తీసుకోవాలని డిపో మేనేజర్ కు ఫిర్యాధు చేశారు.


Similar News