త్వరలో రోడ్డు పనులు ప్రారంభం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

త్వరలో రోడ్డు పనులు కేంద్ర మంత్రి చే ప్రారంభిస్తాము

Update: 2024-10-19 13:20 GMT

దిశ, చేవెళ్ల : త్వరలో రోడ్డు పనులు కేంద్ర మంత్రి చే ప్రారంభిస్తాము అని చేవెళ్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం శనివారం పట్టణ కేంద్రంలో కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. స్పీకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని, పెంటయ్య గౌడ్ ను అభినందిస్తూ హైదరాబాద్ కు అతిసమీపంలో ఉన్నటువంటి చేవెళ్లను అభివృద్ధి చేయడంలో నేను ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇద్దరం కలిసి మార్కెట్ విషయంలో మంత్రి వర్గానికి తెలియజేసి స్థానికంగా ఉన్న మార్కెట్ ను అభివృద్ధి చేసే దిశలో పనిచేస్తామని అన్నారు.కేంద్రంలో ఉన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి నితీష్ గడ్కరీ తో కలిసి త్వరలోనే రోడ్డు పనులను ప్రారంభిస్తామన్నారు.

ముఖ్యంగా ఈ రోడ్డుపై వాహనాలు నడపాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడపాల్సి వస్తుంది అన్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకొని తొందరగా రోడ్డు పనులు చేపడతామని తెలియజేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మంచి మార్కెట్ లభించినపుడే రైతు లాభాల బాట పడతారని భావించి మార్కెటింగ్ అవకాశాలు పెంచడం జరుగుతుందన్నారు. గోదాంలు,కోల్డ్ స్టోరేజీలు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నెలకొల్పటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ బోర్డు సభ్యులు చెంపలు సత్యనారాయణ రెడ్డి ,పీఏసీఎస్ చైర్మన్ ముడిమ్యాల్ ప్రతాప్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు సమతా వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


Similar News