ప్రజావాణి యధావిధిగా : కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న సోమవారం నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

Update: 2023-12-08 12:30 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న సోమవారం నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


Similar News