నీట మునిగిన పంటలు… లబోదిబోమంటున్న రైతులు

శంకరపల్లి మండలంలో గత ఐదు, ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీరు పెట్టిస్తుంది.

Update: 2024-09-07 10:08 GMT

దిశ,శంకర్పల్లి : శంకరపల్లి మండలంలో గత ఐదు, ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కన్నీరు పెట్టిస్తుంది. శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, కంది, జొన్న మొక్కజొన్న, మిరప పూల తోటలో కూరగాయ తోటలలో వర్షపు నీరు నిలిచి పూర్తిగా పాడయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా వర్షం వల్ల పంటచేలలో నీరు నిలిచి కళ్ళ ముందే పంటలు పాడయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


Similar News