Revanth Reddy: ఆకాశమంత ఆహార్యం.. ఖైరతాబాద్ గణేష్‌పై సీఎం స్పెషల్ ట్వీట్

ఆకాశమంత ఆహార్యం, సమస్త జనుల భక్తి పారవశ్యం అంటూ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-07 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆకాశమంత ఆహార్యం, సమస్త జనుల భక్తి పారవశ్యం అంటూ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పూజలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకాశమంత ఆహార్యం.. సమస్త జనుల భక్తి పారవశ్యం ఖైరతాబాద్ మహా గణపతి అని అన్నారు. మహా గణనాధుని దర్శించుకుని, తొలిపూజను నిర్వహించడం.. ఆశీస్సులు పొందడం.. అనిర్వచనీయ అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.

సస్యశ్యామల తెలంగాణ.. సకల జనుల సంక్షేమ మాగాణగా వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ సీఎం రాసుకొచ్చారు. కాగా ఖైరతాబాద్ శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి ఉత్సవాలు ఘణంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా 70 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పి, అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు.


Similar News