పంచలోహ విగ్రహాలు చోరీ

పంచలోహ విగ్రహాలు చోరీ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

Update: 2024-09-28 14:54 GMT

దిశ, యాచారం (ఇబ్రహీంపట్నం) : పంచలోహ విగ్రహాలు చోరీ చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇబ్రహీం పట్నం పరిధిలోని ఎలిమినేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. దాంతో ఏసీపీ కేవీపీ రాజు, సీఐ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి వివరాలను సేకరించారు.

    మూడు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని, వాటి విలువ రూ. లక్ష 50 వేల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా బీరప్ప దేవాలయంలో దొంగతనం జరిగిందని, నాలుగు సంవత్సరాలైనా దొంగలను పోలీసులు పట్టుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News