గ్రామాల్లో సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించాలి : మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి

Update: 2024-07-01 15:04 GMT

దిశ,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. సోమవారం రోజున సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చర్ల పటేల్ గూడ, తుర్కగూడ, కప్ప పహాడ్ గ్రామాలలో ఎన్ ఆర్ జి ఎస్ నిధులు సుమారు 47.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, సమస్యలు లేని గ్రామాలుగా తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.

గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, ఈ సి శేఖర్ గౌడ్, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ మహిపాల్, పిఎసిఎస్ చైర్మన్ ఎద్దుల పాండురంగ రెడ్డి, గురునాథ్ రెడ్డి, జడల రవీందర్ రెడ్డి, కోడూరి రమేష్, మాజీ ఉప సర్పంచ్ నరేందర్, మునీర్, ఎంపీటీసీ ఆంజనేయులు, రాఘవేందర్, ఆయా గ్రామ పెద్దలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Similar News