MLA : అన్ని రంగాలను ఏకతాటిపై నడిపించిన ఘనత కేసీఆర్ దే

అన్ని రంగాలను ఏకతాటిపై నడిపించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని నేడు పరిపాలనను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Update: 2024-10-21 15:01 GMT

దిశ, మీర్ పేట్: అన్ని రంగాలను ఏకతాటిపై నడిపించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని నేడు పరిపాలనను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి చెందిన గీత కార్మికులకు రక్షణ కవచాలను అందచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గీత కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి,బిఆర్ఆర్ ఎస్ నాయకులు, ఎక్సైజ్ అధికారులు, గీతకార్మికులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News