టీఆర్ఎస్ వైపే ప్ర‌జ‌ల చూపు

టీఆర్ఎస్ వ‌ల్లే మునుగోడు అభివృద్ధి సాధ్య‌మ‌ని, ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న అన్నారు.

Update: 2022-10-19 14:20 GMT

దిశ, తుర్కయంజాల్ : టీఆర్ఎస్ వ‌ల్లే మునుగోడు అభివృద్ధి సాధ్య‌మ‌ని, ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని మాజీ మంత్రి జోగు రామ‌న్న అన్నారు. డీసీసీబీ వైస్ చైర్మ‌న్ కొత్త‌కుర్మ స‌త్త‌య్య ఆధ్వ‌ర్యంలో తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో ఉన్న మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల‌ను క‌లిసి ఓటును అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా జోగు రామ‌న్న‌, కొత్త‌కుర్మ స‌త్త‌య్య మాట్లాడుతూ మునుగోడులో కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి గెలుపు ఖాయ‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి ప‌థంలో ముందుకెళ్తోంద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోనే మ‌న‌ రాష్ట్రం నెంబ‌ర్‌వ‌న్‌గా ఉంద‌న్నారు.

హైద‌రాబాద్ న‌గ‌ర‌ శివారు నియోజ‌క‌వ‌ర్గ‌మైన మునుగోడు అభివృద్ధిలో వెనుకంజ‌లో ఉంద‌ని, టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఏడాదిలో నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతామ‌న్నారు. కొంద‌రు సొంత ఆర్థిక లాభాపేక్షను ఆశించ‌డం వ‌ల్లే మునుగోడులో ఉపఎన్నిక వ‌చ్చింద‌ని, అలాంటివారిని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో రైతుబంధు జిల్లా చైర్మ‌న్ వంగేటి ల‌క్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, కిష‌న్‌గౌడ్‌, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ ముత్యంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News