రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...

రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కేశంపేట మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

Update: 2024-10-27 15:14 GMT

దిశ, కేశంపేట: రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కేశంపేట మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భోధునంపల్లి గ్రామానికి చెందిన బండ రాంరెడ్డి (62) అనే వ్యక్తి మద్యం దుకాణం సమీపంలో రోడ్డు దాటుతుండగా అటువైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతనిని 108 సాయంతో షాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Similar News