నందనవనంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2024-10-07 04:19 GMT

దిశ, మీర్‌పేట్: రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని టీకేఆర్ కమాన్ సమీపంలో నందనవనం వెళ్లే ప్రధాన రహదారిపై బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News