దిశ ఎఫెక్ట్ : స్పందించిన ఇరిగేషన్ అధికారులు
దిశ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు ఈ నెల మార్చి 22న చెరువు కట్టను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి.

దిశ, ఇబ్రహీంపట్నం: దిశ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు ఈ నెల మార్చి 22న చెరువు కట్టను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే బురుకుంట కాలువ కబ్జాకి గురై పలకల గోడ నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వచ్చిన కథనానికి స్పందించి సందర్శించిన ఇరిగేషన్ అధికారులు… చెరువులు, కాలువలను కబ్జా చేస్తే చర్యలు తప్పవని ఇరిగేషన్ డి ఈ చెన్నకేశవ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామ పరిధిలో నాగులమ్మ చెరువు నుండి బురుకుంటకు వెళ్లే ప్రధాన కాలువ కబ్జా విషయంపై మత్స్యకార్మికులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం కాలువ కబ్జా జరిగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు డి ఈ చెన్నకేశవ రెడ్డి, ఏఈ హరిత లతో కలిసి పరిశీలించారు. పోల్కంపల్లి లోని పోల్కమ్మ గుడి సమీపంలోని సర్వేనెంబర్ 85 లో 3.31 గుంటల భూమిని దేవరకొండ మూర్తి అనే వ్యక్తి కొనుగోలు చేసి, ఈ భూమికి అనుకొని ఉన్న కాల్వను కబ్జా చేసి పడకల గోడలను నిర్మించారు.
ఈ సందర్భంగా డి ఈ కేశవరెడ్డి మాట్లాడుతూ.. పోల్కంపల్లి లో బురుకుంట కాలువ కబ్జా అయినది వాస్తవమేనని, అక్రమంగా ఏర్పాటు చేసిన పలకల గోడలను తొలగించాలన్నారు. అదేవిధంగా అందులో ఉన్న కథాన్ చెరువు కట్ట, మిగతా భూమి కబ్జా విషయంపై రికార్డులను పరిశీలన చేసి నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మత్స్య కార్మిక శాఖ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరేంకాల నర్సింహ్మ మాట్లాడుతూ.. నాగులమ్మ చెరువు నుండి అక్క చెల్లెలు చెరువు వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల వాగు నుంచి వచ్చే నీరు, ఐదు గ్రామాలైన పోల్కంపల్లి, నాగన్ పల్లి, నెర్రపల్లి, అనాజ్ పూర్, మజీద్పూర్ గ్రామాల రైతులకు జీవనాధారంగా ఉండేదని తెలిపారు. ఈ కాలువను కబ్జా చేసి పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్మించడంతో నీటి ప్రవాహం తీవ్రంగా ప్రభావితమైందనీ, ఇది మత్స్యకారులు, రైతులు, పశువుల పెంపకం చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కథాన్ చెరువు కట్ట విషయమై ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు పరిశీలన చేసి, వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మత్స శాఖ ఆధ్వర్యంలో అక్రమాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య కార్మిక శాఖ అధ్యక్షులు గోరేంకల నరసింహ, జిల్లా అధ్యక్షులు చెనమోని శంకర్, గ్రామ అధ్యక్షుడు కావలి లక్ష్మయ్య, మత్స్య కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.