వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ

వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రెండు తులాల పుస్తెలతాడు ను అపహరించుకుపోయిన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-10-04 14:04 GMT

దిశ, యాచారం (ఇబ్రహీంపట్నం) : వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రెండు తులాల పుస్తెలతాడు ను అపహరించుకుపోయిన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ, తెలిపిన వివరాల ప్రకారం..శేరిగూడ గ్రామ పరిధిలోని రాందాస్ పల్లి గ్రామానికి చెందిన భారతమ్మ, (60) తన వ్యవసాయ పొలంలో పశువులను మేపుతుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి తాగడానికి మంచినీళ్లు కావాలని అడిగారు. ఇవ్వడానికి వెళుతున్న క్రమంలో వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగులు ద్విచక్ర వాహనంపై ఎల్బీనగర్ వైపు వెళుతున్నట్టు కనిపించిందని త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Similar News