రామోజీరావు స్టోరీ ఇన్స్‌పిరేషనల్.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Update: 2024-06-08 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, ట్రూ విజనరీ చెరుకూరి రామోజీరావు మృతి బాధ కలిగించిందన్నారు. రామోజీరావు స్వీయ నిర్మిత వ్యక్తి అని ఆయన జీవిత ప్రయాణి స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని నిలబడి ఆయన సాధించిన విజయాలు అద్భుతమని కొనియాడారు. తెలుగు మీడియాలో, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆప్యాయతను పంచే ఆ వ్యక్తితో గత పదేళ్ల కాలంలో రామోజీరావుతో తాను పలు మార్లు సంభాషించనట్లు తెలిపారు. ఆయన మంచి మాటలను తానేప్పుడు గౌరవిస్తా అని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో రామోజీరావు ఫ్యామిలీ, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి అతి తెలిపారు.


Similar News