Venu Swamy : వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

వివాదస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి(Venu Swamy )కి తెలంగాణ హైకోర్టు(High Court) షాక్ ఇచ్చింది.

Update: 2024-10-28 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : వివాదస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి(Venu Swamy )కి తెలంగాణ హైకోర్టు(High Court) షాక్ ఇచ్చింది. వారంలోగా వేణు కేసులో చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో వారు విడిపోతారని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పడం వివాదానికి దారితీసింది. వేణుపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తమ ముందు హాజరు కావాలని గతంలో వేణు స్వామిని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. అయితే కమిషన్ కు ఆ అధికారం లేదంటూ వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. సోమవారం ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని  హైకోర్టు స్పష్టం చేసింది. వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది.

సినీ, రాజకీయ సెలబ్రిటీ జతకాల పేరుతో వేణు స్వామి ఫేమస్ అయ్యారు. తను చెప్పినట్లు సమంత, నాగ చైతన్య విడిపోయినట్లుగానే.. శోభిత దూలిపాళ్ల, నాగచైతన్య కూడా విడిపోతారంటూ వేణు స్వామి సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలాడు. గ్రహబలం, పేరుబలం, జాతక బలం అని రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే వేణు స్వామి మాటలపై సినీ ఇండస్ట్రీలోని పలువురు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ కేసు వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్వామి బల్లగుద్ది చెప్పారు. అలాగే టీడీపీకి పూర్వవైభవం లేదని కూడా పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ కూడా చేశారు. అయితే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ఏపీ ఎన్నికల్లో తిరగబెట్టడంతో ఆయన మరిన్ని విమర్శల పాలయ్యారు. జ్యోతిష్యం ముసుగులో వేణు స్వామి అనేక మంది వ్యక్తులను మోసం చేశారని, ప్రధాని మోడీ ఫోటోను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ టీవీ5 తెలుగు న్యూస్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ మూర్తి కూడా వేణుస్వామిపై కేసు దాఖలు చేశారు.

Read More..

Jani Master: అర్ధరాత్రి రోడ్డు యాక్సిడెంట్.. దయచేసి వేగంగా వెళ్ళకండి అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ 

Tags:    

Similar News