‘భారత రత్న’ ఇవ్వడమే సరైన నివాళి.. రామోజీరావు మృతిపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు.
దిశ, వెబ్డెస్క్: ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక వ్యక్తి 50 సంవత్సరాల కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధి, నమ్మకాన్ని అందించాడు. రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన నివాళి’ అని ట్వీట్ చేశారు.