పాపికొండలు టూర్ 4 రోజులు బంద్.. రీజన్ ఇదే..!

భద్రాచలం రామయ్య దర్శనం కోసం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులలో చాలా మంది స్వామి వారి దర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్తారు.

Update: 2024-06-28 07:38 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం రామయ్య దర్శనం కోసం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులలో చాలా మంది స్వామి వారి దర్శనం అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్తారు. అయితే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో తుఫాన్ కారణంగా ఆంధ్ర ప్రభుత్వం 4 రోజులు పాపికొండల విహార యాత్రను నిలిపివేసింది. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ కొనసాగుతుందని లాంచీల యాజమాన్యం పేర్కొన్నారు. 

Similar News