కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా అనే యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-02-22 11:00 GMT

దిశ, లింగంపేట్ : ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా అనే యువకుడు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సాయిబాబా గత మూడు సంవత్సరాల క్రితం జంగమయ్య పల్లి గ్రామానికి ఇల్లరికం వెళ్లినట్లు వారు తెలిపారు.

    కుటుంబ కలహాల కారణంగా బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో సాయిబాబా మృతదేహం గుర్తించారు. మృతుని భార్య కలవ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతునికి మూడు నెలల బాబు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.


Similar News