నిండు కుండలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుంచి 52,830 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు.

Update: 2024-10-09 11:58 GMT

దిశ, బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాల నుంచి 52,830 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు. బుధవారం తెల్లవారు జాము నుంచి క్రమ క్రమంగా వరద తగ్గడంతో.. ప్రధాన వరద గేట్ల ను మూసివేశారు. అనంతరం మధ్యాహ్నం వరకు వరద పేరుగుతుండటంతో..మధ్యాహ్నం 2 గంటలకు 10 వరద గేట్లు ఎత్తి గోదావరి లోకి 52,830 క్యూసెక్కులు వరద నీటిని విడుదల చేశారు. వరద కాలువతో 12వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు ఉన్న ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1200 క్యూసెక్కులు, కాకతీయ కాలువతో 6800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కుల, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు,80.5 టీఎంసీలు కాగా..ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉందన్నారు . జూన్ 1 తేదీ నుంచి ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 242 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందన్నారు. 168 టీఎంసీల వరద నీటిని కాలువలతో, వరద గేట్ల నుంచి గోదావరిలోకి విడుదల చేశామన్నారు.

Similar News