ఎస్సై మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ నిరసన

తనను ఎస్సై మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ నిరసనకు దిగింది.

Update: 2024-02-05 15:35 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : తనను ఎస్సై మోసం చేశాడని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ నిరసనకు దిగింది. ఈసంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో అదివారం రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మోసం చేశాడని నిరసన వ్యక్తం చేసింది.

     ఆ సమయంలో ఎస్ఐ విధుల్లో లేకపోవడంతో మహిళ వెను తిరిగింది. ఈ విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగానారే విచారణ కు ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటికే ఎస్ఐ వ్యక్తిగత పనుల నిమిత్తం నాలుగు రోజుల సెలవు పెట్టినట్లు తెలిసింది. ఇటీవల పూర్వపు అదిలాబాద్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఎస్ఐ పై వివాదాలు వెలుగు చూడటంతో పోలీస్ శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.


Similar News