ప్రమాదవశాత్తు కుంటలో పడి మహిళ మృతి

ఓ మహిళ ప్రమాదవశాత్తు కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి పల్లెవాని కుంటలో చోటుచేసుకుంది.

Update: 2024-02-22 10:15 GMT

దిశ, కామారెడ్డి : ఓ మహిళ ప్రమాదవశాత్తు కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి పల్లెవాని కుంటలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ (48) గురువారం ఉదయం 10 గంటల సమయంలో కలాపీ చల్లెందుకు

    పేడ తీసుకురావడం కోసం పక్కనే గల రామేశ్వర్ పల్లి శివారులోని పల్లెవాని కుంట వద్దకు వెళ్లింది. పేడ తీసుకుని చేతులు శుభ్రం చేసుకోవడానికి కుంటలోకి దిగగా కుంటలో జేసీబీతో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


Similar News