గోవా ట్రిప్పుకు వెళ్లిన ఖాకీలు ఎందరు ?

నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది ఇటీవల గోవా టూర్ కు వెళ్లిన వ్యవహారం పై పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు.

Update: 2024-02-05 16:49 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది ఇటీవల గోవా టూర్ కు వెళ్లిన వ్యవహారం పై పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఇటీవల జిల్లాలోని నందిపేట్ మండలంకు చెందిన ఓ యువ నేత గోవా టూర్ కు వెళ్లిన అనంతరం ఆకస్మికంగా చనిపోయారు. అతని ఆధ్వర్యంలో విడతల వారిగా గోవా టూర్ కు వెళ్లారు. అందులో కొందరు విహార యాత్రకు వెళ్లగా కొందరు క్యాసినో ఆడేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ

     టూర్ కు వెళ్లిన వారి వివరాలను ట్రావెల్ ఏజెంట్ ద్వారా సేకరిస్తున్నారు. వీరిలో గతంలో నవిపేట్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ, ఇప్పుడు అదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా నవిపేట్ లో , నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్ధరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు విచారణలో తెలింది. సంబంధిత రిపోర్టు జిల్లా పోలీస్ బాస్ కు చేరింది. అనుమతి లేకుండా రాష్ర్టం సరిహద్ధులు దాటినందుకు చర్యలకు సిద్ధమైనట్లు పోలీస్ శాఖలో చర్చ మొదలైంది. 


Similar News