మున్నూరు కాపుల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటాం

మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.

Update: 2024-03-17 10:20 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం నిజామాబాద్ శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం నూతన పాలకవర్గం కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు.

     తెలంగాణలో అత్యధికంగా ఉండే మున్నూరు కాపులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు బీజేపీ తరఫున ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఆయన అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగాలనే నిధానంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బంటు బాలవర్తి, బంటు బలరాం, నర్సింలు, రామర్తి గంగాధర్, లింగం పాల్గొన్నారు.


Similar News