ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు కూలీలకు గాయాలు

లింగంపేట మండలంలోని మెంగరమ్ గ్రామ శివారులో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి.

Update: 2024-02-25 14:02 GMT

దిశ, లింగం పేట్ : లింగంపేట మండలంలోని మెంగరమ్ గ్రామ శివారులో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ముంబాజిపేట గ్రామం నుండి లింగంపేటకు ఇటుకను తీసుకొని వస్తుండగా మేంగరం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బాబురావు, విష్ణుకుమార్ అనే కూలీలకు గాయాలైనట్లు తెలిపారు. గాయాలైన వీరిని ఎల్లారెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Similar News