బూతులతో టార్చర్ చేస్తూ...వేధింపులు

చదువుకునేందుకు... సైకిల్ పై స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినులను అడ్డగించి, బూతు మాటలు మాట్లాడుతూ టార్చర్ చేస్తున్న ఆకతాయిల ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది.

Update: 2024-03-01 16:36 GMT

దిశ, భిక్కనూరు : చదువుకునేందుకు... సైకిల్ పై స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినులను అడ్డగించి, బూతు మాటలు మాట్లాడుతూ టార్చర్ చేస్తున్న ఆకతాయిల ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన స్కూల్ విద్యార్థినులు పెద్ద మల్లారెడ్డి రెడ్డి గ్రామంలోని పాఠశాలలో చదువుకునేందుకు ప్రతిరోజూ

    సైకిల్ పై వచ్చి వెళ్తుంటారు. అయితే గత నాలుగైదు రోజులుగా కొందరు ఆకతాయిలు వారిని అడ్డుకొని అసభ్యకర బూతు మాటలు మాట్లాడుతూ ఆ పిల్లల్ని ఏడిపించేవారు. దీంతో మనస్థాపానికి గురైన స్కూల్ విద్యార్థినిలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో, వారిని పట్టుకొని చితకొట్టి భిక్కనూరు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ముగ్గురు ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కుమార్ వివరించారు. 

Similar News