అదుపుతప్పి చెట్టును ఢీకొన్న టాక్టర్

కోళ్ల ఫారం నుంచి గడ్డి నింపుకునేందుకు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

Update: 2023-12-05 11:05 GMT

దిశ, భిక్కనూరు : కోళ్ల ఫారం నుంచి గడ్డి నింపుకునేందుకు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్​లో మంగళవారం గడ్డి నింపుకొచ్చేందుకు, గ్రామానికి చెందిన వంక విజయ్, జి.రామస్వామి, ప్రదీప్ లు లేబర్ గా వెళ్లారు. మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలోని దామర చెరువు నుంచి బస్వాపూర్

     వెళ్లే దారిలో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడుని తప్పించ బోగా అదుపుతప్పి ఎడమవైపు రోడ్డు దిగిపోయి చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైన ఉన్నవారు ఎగిరి కింద పడిపోయారు. అయితే మెష్ జాలి పై పడిన వంక విజయ్ కాలు కింది భాగం లోతుగా తెగి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే అంబులెన్స్ లో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేసి, తీవ్రంగా గాయపడిన వంక జీవన్ ను మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయగా, గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Similar News