మదన్ మోహన్ గెలిచాడని పాదయాత్ర చేసిన సర్పంచ్

ఎల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ఎన్నికల్లో గెలవాలని మొక్కుకున్న వ్యక్తి తన మొక్కు తీర్చుకుంటున్నాడు.

Update: 2023-12-04 12:38 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ఎన్నికల్లో గెలవాలని మొక్కుకున్న వ్యక్తి తన మొక్కు తీర్చుకుంటున్నాడు. ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన, సర్పంచ్ సత్తయ్య మదన్మోహన్ గెలవాలని మొక్కుకున్నాడు. కాగా ఆదివారం వెలువడిన ఫలితాల్లో భారీ మెజార్టీతో గెలుపొందడంతో సర్పంచ్ తన మొక్కులు తీర్చాడానికి సోమవారం, రుద్రారం గ్రామంలోని చర్చివద్ద కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించాడు. రుద్రారం గ్రామం నుండి మెదక్ చర్చి వరకు తన పాదయాత్రను కొనసాగిస్తానని మదన్ మోహన్ అంటే అభిమానమని సర్పంచ్ సత్తయ్య తెలిపారు.

Tags:    

Similar News