పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడులు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పల్లి లో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు.

Update: 2024-02-21 15:36 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పల్లి లో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. బుధవారం పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు పట్టుబడగా వారి నుంచి రూ.8270 నగదు, 9 సెల్ ఫోన్స్ , 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురు పేకాట రాయుళ్లు పరారీ అయ్యారన్నారు. పట్టుబడిన వారిని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. 


Similar News