ఎస్ ఎస్ సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి

ఎస్ ఎస్ సీ విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) దుర్గాప్రసాద్ అన్నారు.

Update: 2024-02-23 11:28 GMT

దిశ, ఆర్మూర్ : ఎస్ ఎస్ సీ విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) దుర్గాప్రసాద్ అన్నారు. ఆర్మూర్ లో శుక్రవారం ఆర్మూర్ డివిజన్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ,గురుకుల పాఠశాలల హెచ్ఎం లకు ఆదర్శ పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేసి డీఈఓ పలు సూచనలు చేశారు.

    ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. బడి బయట పిల్లలను గుర్తించి వారికి పని ప్రాంత పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. సీ గ్రేడ్ విద్యార్థులను ఏ గ్రేడ్ వచ్చేటట్లు కృషి చేయాలని, మార్చి 1 వ తేదీ నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు లైబ్రేరి పీరియడ్ లో కథల పుస్తకాలు చదివించాలని హెచ్ఎం లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వీఎం సెక్టోరియల్ అధికారులు , ఎంఈఓ పింజరాజ గంగారం తదితరులు పాల్గొన్నారు. 


Similar News