Students strike : విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలని ధర్నా..

విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా ఆర్టీసీ వారు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

Update: 2024-07-23 15:07 GMT

దిశ, కామారెడ్డి : విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా ఆర్టీసీ వారు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో విద్యార్థులు బస్సుల కోసం ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను ఆపి రోడ్డు పై బ్యాగులు అడ్డంగా పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గుండారం నుంచి వచ్చిన బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.

Tags:    

Similar News