దళిత బంధు నిధులు విడుదల చేయండి

దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు లబ్ధిదారులు వినతిపత్రం అందజేశారు.

Update: 2024-02-25 12:48 GMT

దిశ, కామారెడ్డి : దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు లబ్ధిదారులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని దళిత బంధు లబ్ధి దారులు ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కలిసి దళిత బంధు-2లో ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వామి, రవీందర్, నర్సింలు, రాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News