జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద మండలాల జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ ను సీఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ అధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రంను అందించారు.

Update: 2024-02-21 15:28 GMT

దిశ, నిజంసాగర్ : కామారెడ్డి జిల్లా జుక్కల్, బిచ్కుంద మండలాల జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ ను సీఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ అధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రంను అందించారు. బుధవారం జుక్కల్ ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ కార్మికులనుద్దేశించి మాట్లాడారు. జీపీ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇరువై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

    పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కార్మికులందరికీ డబుల్ బెడ్ రూం లు ఇవ్వాలని, దాదాపుగా ఐదారు నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతూ జీపీ కార్మికుల సమస్యలన్నింటికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జుక్కల్, బిచ్కుంద మండలాల గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు గోవింద్, వీరయ్య, గంగారాం, ఙ్ఞానేశ్వర్, సాయులు, శంకర్, లింగురామ్, లక్ష్మన్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News