కిష్టాపూర్ లో నాలుగు బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో నాలుగు బెల్ట్ షాప్ లపై బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించారు.

Update: 2024-03-18 15:49 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో నాలుగు బెల్ట్ షాప్ లపై బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించారు. అయినప్పటికీ ఈ సమాచారం పోలీసులు సోమవారం రాత్రి వరకు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయం తెలిసిన వెంటనే బీర్కూర్ ఎస్ ఐ రాజశేఖర్ వివరణ కోరగా కిష్టాపూర్ లో నాలుగు బెల్ట్ షాప్ లపై దాడి చేశామని, వారి వద్ద నుంచి సుమారు 30 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఆ బెల్ట్ షాపులను నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


Similar News