విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఒకరి మృతి

మచ్చర్లలో విద్యుత్ స్తంభానికి ఢీకొని ఒకరి మృతి చెందారు.

Update: 2024-10-15 13:14 GMT

దిశ ,ఆర్మూర్ : మచ్చర్లలో విద్యుత్ స్తంభానికి ఢీకొని ఒకరి మృతి చెందారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంభానికి మోటార్ సైకిల్ ఢీ కొట్టుకొని చిన్నారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. మచ్చర్లకు చెందిన చిన్నారెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెట్రోల్ పంపు వద్ద విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టాడు. స్తంభానికి ఢీ కొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలియగానే ఆర్మూర్ పోలీస్ ఏఎస్ఐ లక్ష్మణ్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేశారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Similar News