నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 14,000 వేల క్యూసెక్కుల నీటి విడుదల..

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 14,000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు.

Update: 2024-09-25 15:46 GMT

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 14,000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం నుండి 14,000 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రావడంతో ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేసి 15,000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరలోకి వదిలిపెడుతున్నామని పేర్కొన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.96 అడుగులు 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17.744 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందని, ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కొరకు వదిలిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మంజీర తీర ప్రాంత రైతులు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, మంజీరా వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.


Similar News