ఈనెల 10న నవోదయ ప్రవేశ పరీక్ష...

ఈనెల 10వ తేదీ ఆదివారం రోజున జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలలో ఖాళీగా ఉన్న పరిమిత సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-02-06 14:28 GMT

దిశ,నిజాంసాగర్: ఈనెల 10వ తేదీ శనివారం రోజున జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలలో ఖాళీగా ఉన్న పరిమిత సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, నిజాంసాగర్ లోని నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు ఉదయం 10:30ని పరీక్షా కేంద్రాలకు చేరాలని ఆమె అన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి విద్యార్థిని, విద్యార్థులు హాల్ టికెట్ లతో పాటు కేవలం బ్లాక్ లేదా బ్లూ పెన్నులను మాత్రమే తీసుకొని రావాలని, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ లను మీసేవ, లేదా ఆన్లైన్ సెంటర్ లలో డౌన్ లోడ్ చేసుకోవాలని తెలియజేశారు.


Similar News