బాధ్యతగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి:ప్రభుత్వ సలహాదారు

బాధ్యతగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచించారు.

Update: 2024-10-11 10:23 GMT

దిశ భిక్కనూరు : బాధ్యతగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచించారు. ప్రజలకు ఫుల్ టైం సర్వీస్ చేయాలన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో జప్తి శివునూరు వద్ద ఉన్న ఫామ్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆయన చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు సూచన మేరకు ఈనెల 20న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ప్రోగ్రాం కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని షబ్బీర్ అలీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీం రెడ్డి,కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షులు గాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, తాటిపాముల లింబాద్రి, అందె దయాకర్ రెడ్డి, పి మహిపాల్ రెడ్డి, దుంపల మోహన్ రెడ్డి, అంకం రాజు, పి నర్సింహారెడ్డి,కోక స్వామి, ధర్మయ్య, కొండ సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.


Similar News