బీజేపీలో ముసలం.....

గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అనడంతో పోతంగల్ మండల బీజేపీ శ్రేణులలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-03-18 10:27 GMT

దిశ, కోటగిరి : గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అనడంతో పోతంగల్ మండల బీజేపీ శ్రేణులలో హాట్ టాపిక్ గా మారింది. పోతంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.... పోతంగల్ మండల బీజేపీ నాయకులు గ్రూపు రాజకీయాలకు పోకుండా పార్టీ ఆదేశించిన నిర్ణయాలకు కట్టుబడి కలిసికట్టుగా ఉంటూ బీజేపీ పార్టీ కోసం పనిచేసి మన జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి బిబి పాటిల్ గెలుపు దిశగా పనిచేయాలని ఆమె అన్నారు. గత కొద్ది రోజులుగా పోతంగల్ మండలంలోని బీజేపీ పార్టీలో ముసలం నడుస్తున్న విషయం తెలిసినప్పటికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాటలతో తేటతెల్లమైందనే చెప్పవచ్చు.


Similar News