రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని పాత వర్ని చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఈర్నాల సంపత్ కుమార్ (65) అనే వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ తెలిపారు.

Update: 2024-02-25 09:07 GMT

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని పాత వర్ని చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఈర్నాల సంపత్ కుమార్ (65) అనే వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు తన ద్విచక్ర వాహనంపై అతి వేగంగా, అజాగ్రత్తగా చందూర్ నుండి వర్ని వస్తుండగా మార్గ మధ్యలో వర్ని చౌరస్తా వద్ద కింద పడి పోయి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Similar News