మీడియా సెంటర్ ప్రారంభం

పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం.28 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.

Update: 2024-03-17 13:17 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం.28 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికెషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

    ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలు వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ, మంజూరు చేయాలని సూచించారు. షాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసీఎంసీ నుండి ముందస్తు

    అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, ,కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News