Ka Paul : నిజామాబాద్ నగరంలో కేఏ పాల్ సుడిగాలి పర్యటన

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

Update: 2023-09-20 14:38 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఆయన నగరంలోని పలు వీధుల గుండా కారులో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కంటేశ్వర్ లోని టీ స్టాల్ వద్ద టీ తాగి అందరికీ టి, బిస్కెట్లు ఇప్పించారు. ఇది బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిన పార్టీ అని మీ అమూల్యమైన ఓటును ప్రజాశాంతి పార్టీకి వేయాలని కోరారు.సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు.

Tags:    

Similar News