సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ల పై దృష్టి సారించాలి

పార్లమెంట్ ఎన్నికల పై పోలీస్, రెవెన్యూ అధికారులతో సోమవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో 05-జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 013-(SC ) జుక్కల్ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డి. శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2024-03-18 11:47 GMT

దిశ, మద్నూర్: పార్లమెంట్ ఎన్నికల పై పోలీస్, రెవెన్యూ అధికారులతో సోమవారం మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో 05-జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 013-(SC ) జుక్కల్ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డి. శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఎన్నికలు సజావుగా సాగడానికి పోలీస్, రెవెన్యూ అధికారులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పోలింగ్ స్టేషన్ లలో తాగునీరు, విద్యుత్, వికలాంగులకు ర్యాంప్ లు ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. వేసవి కాలం కాబట్టి త్రాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు లో నిఘా విభాగం, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో బాన్సువాడ డీఎస్పీ , సీఐ జగడం నరేష్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, 7-మండలాల తహసిల్దార్ లు, మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డీ ముజీబ్, డిప్యూటీ తహసీల్దార్ భరత్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్దావర్ శంకర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News