రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- ఎమ్మెల్యే మదన్మోహన్, ఎంపీ సురేష్

Update: 2024-09-27 09:06 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మారెడ్డి రజిత వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. పట్టణ కేంద్రంలోని,ముత్యపు రాఘవులు,ఫంక్షన్ హల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్,ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, రైతులకు,ప్రభుత్వం చేసిన రుణమాఫీతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం,ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. త్వరలోనే రైతులకు రైతు భరోసా కూడా అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.... వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి నాగిరెడ్డి పేట,లింగంపేట మండలంలోని రైతులకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, మార్కెట్ కమిటీ డెరైక్టర్ లు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి రమ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, మాజీ జడ్పీటీసీ సామెల్, లింగంపేట మండల మాజీ జడ్పీటీసీ శ్రీలత సంతోష్ రెడ్డి, మాజీ సొసైటీ చెర్మన్ బోండ్ల సాయిలు, మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, గంట సాయిలు, మాజీ ఎంపిటిసి షెకెవత్ అలీ, బిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి, పద్మారావు,మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News