6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రకళ గురువారం తెలిపారు.

Update: 2024-02-22 14:28 GMT

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రకళ గురువారం తెలిపారు. దరఖాస్తు గడువు తేదీ మార్చి 2వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు. అదేవిధంగా ఏడు నుండి పదవ తరగతి లో

    మిగిలి ఉన్న సీట్ల కొరకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్నందుకు 2024 మార్చి 2 చివరి తేదీ కాగా 7 ఏప్రిల్ 2024 రోజున ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్, వికలాంగ విద్యార్థులకు 125 రూపాయలు కాగా ఇతరులకు 200 రూపాయల నిర్ణీత రుసుము తీసుకోనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Similar News