విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి

మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్యాట్ గ్రామ పంచాయతీ ఎలక్ట్రీషియన్ సైదు లింగం మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.

Update: 2024-02-22 15:42 GMT

దిశ, భీంగల్ : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్యాట్ గ్రామ పంచాయతీ ఎలక్ట్రీషియన్ సైదు లింగం మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. బుధవారం గ్రామ శివారులోని ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ఆప్​ చేసి ఫ్యూస్ వేస్తుండగా ప్రమాదవశత్తు కుడి చేతికి షాక్ తగిలినట్లు వెల్లడించారు. షాక్ తగలాగానే లింగం కింద పడగా చికిత్స నిమిత్తం హాస్పిటలకు తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుడు లింగం గురువారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. 


Similar News