దిశ ఎఫెక్ట్​ ...బీసీ కాలనీలో బోరు

తాగునిటీ కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన శీర్షికతో దిశ దినపత్రికలో ఈ నెల 21న ప్రచురితమైన వార్తకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ స్పందించారు.

Update: 2024-02-28 11:54 GMT

దిశ, తాడ్వాయి : తాగునిటీ కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన శీర్షికతో దిశ దినపత్రికలో ఈ నెల 21న ప్రచురితమైన వార్తకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ స్పందించారు. శాశ్వత పరిష్కారం దిశగా తాడ్వాయి బీసీ కాలనీలో బోరు వేయించాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలతో స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం కొబ్బరికాయ కొట్టి బోరును వేయించారు. ఈ బోరును సీడీపీ నిధుల ద్వారా వేయిస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామ్ రావు, వెంకట్ రాంరెడ్డి, జంగం రాజు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News