అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

పసికందును రోడ్డుపై విడిచిపెట్టి అదృశ్యమైన మహిళ గురువారం నిజాంసాగర్ ప్రధాన కాలువలో శవమై తేలింది.

Update: 2024-02-29 14:56 GMT

దిశ,నిజాంసాగర్ : పసికందును రోడ్డుపై విడిచిపెట్టి అదృశ్యమైన మహిళ గురువారం నిజాంసాగర్ ప్రధాన కాలువలో శవమై తేలింది. నిజాంసాగర్ ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని తాడ్కొల్ గ్రామానికి చెందిన ఆందోల్ శిరీష కు గండిమాసనిపేట్ గ్రామానికి చెందిన సతీష్ తో గత నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక సంవత్సరం బాబు కూడా ఉన్నాడు.

    ఇదిలా ఉండగా మృతురాలి తల్లి లక్ష్మి అల్లుడు సతీష్ కు ఫోన్ చేసి తన కూతురు తో మాట్లాడి ఇంటికి రమ్మని చెప్పడంతో ఉదయం 10 గంటలకు వస్తానని చెప్పి బుధవారం నిజాంసాగర్ ప్రధాన కాలువ గాలిపూర్ సమీపంలో రోడ్డుపై తన కుమారుడిని వదిలిపెట్టి అదృశ్యమైంది. దీంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ప్రధాన కాలువ నీటి విడుదలను నిలిపివేసి వెతకగా గురువారం ప్రధాన కాలువలో 9వ డిస్ట్రిబ్యూటర్ వద్ద శవమై తేలినట్లు ఎస్ఐ కె.సుధాకర్ పేర్కొన్నారు. మృతురాలి భర్త సతీష్ పై అనుమానం ఉందని తెలుపగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Similar News