కళ్లకి గంతలు కట్టుకొని బైకుల పై అయోధ్య కు బయలుదేరిన మెజీషియన్లు

హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు దాదాపు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిళ్ల పైన యాత్ర చేస్తున్న మేజీషియన్లు మారుతి జోషి, రామకృష్ణ‌లు శుక్రవారం రాత్రి కామారెడ్డి కి చేరుకున్నారు.

Update: 2024-02-24 07:30 GMT

దిశ, కామారెడ్డి : హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు దాదాపు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిళ్ల పైన యాత్ర చేస్తున్న మేజీషియన్లు మారుతి జోషి, రామకృష్ణ‌లు శుక్రవారం రాత్రి కామారెడ్డి కి చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుండి వీరు అయోధ్యకి బయలుదేరారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, బీజేపీ నాయకులు వారి కళ్లకి గంతలు కట్టి వారికి వీడ్కోలు పలికారు. మెజీషియన్లు మారుతి జోషి, రామకృష్ణలు మాట్లాడుతూ.. దశాబ్దాల కల నెరవేరి అయ్యోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంగా తాము సైతం రాముని సేవలో జీవితం పరితాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో కళ్లకి గంతలు కట్టుకొని నిన్న హైదరాబాద్ నుంచి బయల్దేరామని తెలిపారు. ఈరోజు కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. కళ్లకి దూది పెట్టుకొని వాటిపై గంతలు కట్టిన తర్వాత ముఖం మీద ముసుగు వేసుకొని బైక్ పై యాత్ర చేస్తున్నట్లు తెలిపారు.


Similar News