ఆర్మూర్ లో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మంగళవారం రాత్రి బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-03-19 15:15 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మంగళవారం రాత్రి బిగ్ షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ బీఆర్ఎస్ తాజా మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, మాజీ చైర్ పర్సన్ స్వాతి సింగ్ బబ్లులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యాల్ల సాయి రెడ్డి, మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం జ్యోతి మారుతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్లు తాటి హనుమండ్లు, రింగుల భారతి భూషణ్, బాదం రాజ్ కుమార్, ఎస్. ఆర్. సుజాత రమేష్, మాజీ కౌన్సిలర్లు సడక్ వినోద్, లత, శ్రీనివాస్, బోండ్ల సంతోష్, మాజీ సర్పంచులు పొంగి సదాశివ్, సాయినాథ్ గౌడ్, సట్లపల్లి సవిత గణేష్ , నీరడి రాజేశ్వర్ ,సుద్ధపల్లి సుమలత నర్సయ్య, సింగిరెడ్డి మోహన్, మాజీ సొసైటీ డైరెక్టర్ కొట్టాల మోహన్, కొంగి రాము, పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, ఎన్వీ రవీందర్ రెడ్డి (చిట్టి), రాజు భాయ్ ,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News