విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.
దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన ప్రకారం రాజు తన సొంత వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించడానికి వెళ్లి పక్కనే ఉన్న స్టార్టర్ డబ్బా వద్ద మోటార్స్ స్టార్ట్ చేయడానికి వెళుతుండగా కరెంట్ వైర్ చెయ్యికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.